యాప్నగరం

రాజకీయ ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటా

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా తన రాజకీయ రంగప్రవేశంపై మీడియాతో మాట్లాడారు.

TNN 5 Jan 2017, 6:50 pm
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా తన రాజకీయ రంగప్రవేశంపై మీడియాతో మాట్లాడారు. చెన్నైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లోకి రావాలా వద్దా అన్న అంశంపై తీవ్రంగా ఆలోచిస్తున్నానని చెప్పారు. తన నిర్ణయమేంటో మూడు వారాల తరువాత ప్రకటిస్తానని తెలిపారు. అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు శశికళ చేతికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అది నచ్చని వాళ్లు చాలా మంది ఉన్నారు. వారంతా దీపా రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. వందలాది మంది కార్యకర్తలు దీపా ఇంటి బైట కూర్చుని మద్దతు తెలియజేస్తున్నారు. రోజూ అనేక మంది వస్తుండడంతో దీపా వారిని ఆనందిస్తున్నారు. ప్రజల స్పందన చూసి రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కలిగిందని చెప్పారు.
Samayam Telugu jayalalitas niece deepa jayakumar spoke with media
రాజకీయ ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటా


తన అత్త జయలలిత మరణంపై దీపా మాట్లాడుతూ అనుమానాన్ని వ్యక్తం చేశారు. జయకు ఆసుపత్రిలో అందించిన చికిత్స వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీపా ముఖం, హావభావాలు జయను పోలి ఉండడంతో అక్కడికొచ్చిన అనేకమంది కార్యకర్తలు ఆసక్తిగా ఆమెను చూశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.