యాప్నగరం

ప్రభుత్వానికి, పార్టీకి దూరంగా వుండండి: శశికళ

తమిళనాడు ప్రభుత్వానికి, ఏఐఏడీఎంకే పార్టీకి దూరంగా ఉండండి అంటూ తన కుటుంబసభ్యులు, తోబుట్టువులు...

TNN 10 Dec 2016, 6:47 am
తమిళనాడు ప్రభుత్వానికి, ఏఐఏడీఎంకే పార్టీకి దూరంగా ఉండండి అంటూ తన కుటుంబసభ్యులు, తోబుట్టువులు, మేనల్లుళ్లు, మేనకోడళ్లను హెచ్చరించారు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహిత మిత్రురాలు శశికళ. ప్రభుత్వ కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాల్లో మీరు కలగజేసుకోరాదు అని శశికళ తన కుటుంబసభ్యులని ఆదేశించినట్టు ఆమె కుటుంబానికి దగ్గరిగా మెదిలే సన్నిహితవర్గాలు తెలిపాయి పోస్ గార్డెన్‌లోని జయలలిత నివాసంలో బుధవారం జరిగిన సమావేశంలో శశికళ ఈ ఆదేశాలు జారీ చేసినట్టు సదరు వర్గాలు పేర్కొన్నాయి.
Samayam Telugu jayalalithaa news sasikalaa asks family members to stay from govt and aiadmk
ప్రభుత్వానికి, పార్టీకి దూరంగా వుండండి: శశికళ


రాజాజీహాలులో జయలలిత పార్ధీవదేహాన్ని ఉంచినప్పుడు మొదలుకుని అంత్యక్రియలు పూర్తయ్యేవరకు శశికళ కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని విడవకపోవడంపై సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా జయలలిత మృతి వెనుక శశికళ హస్తం వుందా అనే ఆరోపణలు వినిపిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో తన కుటుంబాన్ని పార్టీకి, ప్రభుత్వానికి దూరం పెట్టడం ద్వారా ఆ విమర్శలకి సరైన సమాధానం ఇవ్వవచ్చనేది శశికళ ఆలోచన అయ్యుంటుంది అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.