తమిళనాడు ముఖ్యమంత్రిగా మరోమారు బాధ్యతలు స్వీకరించబోతున్న అన్నా డీఎంకె అధినేత్రి జయలలిత తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం పంపారు. చంద్రబాబుతో పాటు దేశ ప్రధాని నరేంద్రమోడీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా జయలలిత నుండి ఆహ్వానాలు వెళ్లాయి. మద్రాస్ యూనివర్సిటీ ప్రాంగణంలో జయలలిత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి డీఎంకె అధ్యక్షుడు ఎం.కరుణానిధికి కూడా ఆహ్వానం పంపినట్లు ఏఐడీఎంకె వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆమె తన తొలి సంతకాన్ని ఎన్నికల వాగ్దానాల నెరవేర్పు పత్రాలపైనే చేయనున్నారు. జయ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి మోడీ హాజరయ్యే అవకాశం లేదు. ప్రస్తుతం ఇరాన్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రతిగా కేంద్రమంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. జయతో పాటు మరో 28మంది ఏఐడీఎంకె నేతలు జయ క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు.
చంద్రబాబుకు జయలలిత ఆహ్వానం
అన్నా డీఎంకె అధినేత్రి జయలలిత తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఏపీ సీఎంకు ఆహ్వానం పంపారు.
TNN 22 May 2016, 8:29 pm