యాప్నగరం

అమ్మ కోసం విఘ్నాదిపతికి పూజలు

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం కోసం ఆమె మద్దతుదారులు విఘ్నాధిపతి వినాయకుడికి పూజలు చేశారు.

TNN 20 Oct 2016, 1:57 am
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం కోసం ఆమె మద్దతుదారులు విఘ్నాధిపతి వినాయకుడికి పూజలు చేశారు. గత నెలలో జయలలిత అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటినుండి ఆమెకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమిటనే సంగతి మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం కోసం మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు చెన్నై అపోలో ఆసుపత్రి వెలుపల పూజలు అర్పిస్తున్నారు. ప్రతీరోజు ఆసుపత్రి వెలుపల జయ ఆరోగ్యం కోసం ప్రార్థనలు జరుపుతున్నారు. తాజాగా ఆమె ఆయురారోగ్యాలతో ఆసుపత్రి నుండి బయటకు రావాలని కోరుకుంటూ విఘ్నాధిపతి వినాయకుడికి పూజలు అర్పించారు. వినాయకుడి విగ్రహాన్ని తీసుకువచ్చిన అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు.
Samayam Telugu jayalalithaa supporters perform special ganesh puja outside apollo hospital
అమ్మ కోసం విఘ్నాదిపతికి పూజలు

ఆమె ఆరోగ్యం కోసం హిందువులు, ముస్లింలు, క్రైస్తవులనే తేడా లేకుండా తమ ఆచారాల ప్రకారం ప్రార్థనలు జరుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.