యాప్నగరం

పళనిసామిపై జయలలిత మేనకోడలు దీప ఫైర్

ఏఐఏడీఎంకే శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన పళనిసామిపై జయలలిత మేనకోడలు దీప ఆగ్రహం వ్యక్తంచేశారు.

TNN 14 Feb 2017, 8:18 pm
ఏఐఏడీఎంకే శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన పళనిసామిపై జయలలిత మేనకోడలు దీప ఆగ్రహం వ్యక్తంచేశారు. శశికళ అడుగులకి మడుగులొత్తేవారికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హతలు లేవని పళనిసామిపై మండిపడిన ఆమె.. అమ్మ ఆశీర్వాదం వున్నవారికే ఆ అర్హత ఉంటుందని అన్నారు. శశికళకి జైలు శిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో ఆమె సమక్షంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు పళనిసామిని తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే.
Samayam Telugu jayalalithaas niece deepa reacts to supreme court verdict and palanisamy
పళనిసామిపై జయలలిత మేనకోడలు దీప ఫైర్


శశికళ అనంతరం ఆమె స్థానంలోకి వచ్చిన పళనిసామికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకి మధ్యనే ఇప్పుడు సీఎం సీటు కోసం పోటీ నెలకొని వుంది. ఈ ఇద్దరికి సరైన మెజార్టీ లేనిపక్షంలో డీఎంకే నేత స్టాలిన్‌కి ఆ ఛాన్స్ వరించే అవకాశం వుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.