యాప్నగరం

ఆర్కే నగర్‌లో మొదలైన పోలింగ్

జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఎట్టకేలకు ఎన్నిక జరగుతోంది. గతేడాది డిసెంబరు 5 న అన్నాడీఎంకే అధినేత్రి అకాలమరణం చెందడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.

TNN 21 Dec 2017, 8:29 am
జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఎట్టకేలకు ఎన్నిక జరగుతోంది. గతేడాది డిసెంబరు 5 న అన్నాడీఎంకే అధినేత్రి అకాలమరణం చెందడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నిక కోసం గత ఏప్రిల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అనివార్య కారణాలతో ఎన్నిక వాయిదా పడింది. మరోసారి నోటిఫికేషన్ విడుదల చేయడంతో గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలైంది. జయలలిత మరణం తర్వాత జరుగుతోన్న తొలి ఎన్నిక ఇదే కావడంతో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ చివరిరోజు వరకూ అన్ని శక్తియుక్తులూ ఒడ్డాయి.
Samayam Telugu jayalalithaas rk nagar bypoll begins litmus test for aiadmk
ఆర్కే నగర్‌లో మొదలైన పోలింగ్


అంతేకాదు ఈ ఎన్నిక ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సారథ్యంలోని అన్నాడీఎంకే పార్టీకి అగ్నిపరీక్షగా మారింది. రెండాకుల గుర్తు తమ పార్టీకే దక్కడంతో గెలుపుపై అన్నాడీఎంకే ధీమాగా ఉంది. మొత్తం 59 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా 'త్రిముఖ' పోటీ కనిపిస్తోంది. అన్నాడీఎంకే తరఫున ఇ.మధుసూదన్, స్వతంత్ర అభ్యర్థిగా శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్, ప్రతిపక్షమైన డీఎంకే నుంచి ఎన్.మరుదు గణేష్ బరిలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ ఉంది.

గతంలో అక్రమాలు జరిగాయని భావిస్తూ ఉపఎన్నికను ఈసీ వాయిదా వేసింది. దీనిపై మద్రాసు హైకోర్టు జోక్యం చేసుకుని, ఎన్నికను నిర్వహించాలని ఆదేశింది. దీంతో ఆర్కేనగర్ ఎన్నికను ఈసీ సైతం కీలకంగా తీసుకుని తొమ్మిది మంది పరిశీలకులను రంగంలోకి దింపింది. 2.500 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 200కు పైగా నిఘా కెమెరాలు, 75 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, 21 స్టాటిక్ సర్విలెన్స్ టీమ్‌లు, వీడియో రికార్డింగ్ పరికరాలతో కూడిన 20 మానిటరింగ్ టీమ్‌లు, 45 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. కాగా, ఈనెల 24న ఓట్ల లెక్కింపు జరిపి ఎన్నికల ఫలితాన్ని ప్రకటించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.