యాప్నగరం

సీనియర్ తమిళ మంత్రులతో గవర్నర్ భేటీ!

తమిళనాడు సీనియర్ మంత్రులు పన్నీర్ సెల్వం, పళనిస్వామి ఇన్‌ఛార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా జయ ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు.

TNN 7 Oct 2016, 8:28 pm
తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో రాష్ట్ర సీనియర్ మంత్రులు పన్నీర్ సెల్వం, పళనిస్వామి, చీఫ్ విప్‌లు రాజ్‌భవన్లో గవర్నర్‌తో సమావేశం అయ్యారు. తమిళనాడు ఇన్‌ఛార్జి గవర్నర్‌గా వ్యవహరిస్తోన్న సీహెచ్ విద్యాసాగర్ రావు జయలలిత ఆరోగ్యం విషయమై మంత్రులతో చర్చించినట్లు రాజ్‌భవన్ వర్గాలు ఓ ప్రకటనలో వెలువరించాయి. కావేరీ వివాద పరిష్కారం కోసం రాష్ట్రానికి ఉన్నత స్థాయి టెక్నికల్ కమిటీ రానున్న అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చిందని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. కమిటీ పర్యటన కోసం ఏర్పాట్లు, రాష్ట్ర రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కమిటీకి ఏయే అంశాలను సమర్పించనున్నారు అనే విషయాలను గవర్నర్ మంత్రులను అడిగి తెలుసుకున్నారు. పరిపాలనా వ్యవహారాల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్ రావు గవర్నర్‌కు వివరించారు. రాష్ట్రంలో పాలన తీరును కూడా గవర్నర్‌ అడిగి తెలుసుకున్నారు.
Samayam Telugu jayaliatha health governor enquired ministers about amma health
సీనియర్ తమిళ మంత్రులతో గవర్నర్ భేటీ!

గవర్నర్‌తో మంత్రుల భేటీ నేపథ్యంలో జయలలితకు విశ్వాసపాత్రుడైన పన్నీర్‌సెల్వంను తాత్కాలిక ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. జయలలిత ఇంకా కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాల్సివస్తుందని వైద్యులు చెబుతున్న నేపథ్యంలో రాజ్‌భవన్‌ ఈ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. గతంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం పన్నీర్‌ సెల్వానికి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.