యాప్నగరం

జయనగర.. ఎవరి ఖాతాలోకో..!

పోటీలో ఉన్న అభ్యర్థి మరణించడంలో వాయిదా పడిన బెంగళూరు పరిధిలోని జయనగర అసెంబ్లీ సీటు ఎన్నిక పోలింగ్ నిన్న జరిగింది.

Samayam Telugu 12 Jun 2018, 9:51 am
పోటీలో ఉన్న అభ్యర్థి మరణించడంలో వాయిదా పడిన బెంగళూరు పరిధిలోని జయనగర అసెంబ్లీ సీటు ఎన్నిక పోలింగ్ నిన్న జరిగింది. మే 12న జరగాల్సిన పోలింగ్ జూన్ 11న జరిగింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు జరగాల్సిన ఎన్నిక నిన్న పూర్తి అయ్యింది. 55 శాతం పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల ప్రకారం.. ఈ సీటు ఎవరి ఖాతాలోకి చేరుతుందనేది ఆసక్తిదాయకమైన అంశమే.
Samayam Telugu sowmya-reddy


ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ - జేడీఎస్‌లకు బోటాబోటి మెజారిటీ ఉంది. మంత్రివర్గ విస్తరణతో ఉన్నవారి మధ్యన కూడా అసహనాలు మొదలయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో జయనగర సీటు ఎవరి ఖాతాలోకి పడుతుందనేది ఆసక్తిదాయకమైన అంశం అవుతోంది.

కాంగ్రెస్ తరఫు నుంచి మాజీ హోం మంత్రి రామలింగారెడ్డి కూతురు సౌమ్యా రెడ్డి పోటీ చేశారు. ఈమె విజయం పట్ల విశ్వాసంతో ఉన్నారు. పోలింగ్ కు ముందు జేడీఎస్ కూడా కాంగ్రెస్ కు మద్దతు పలకడంతో ఈమె కు విజయం పట్ల మరింత విశ్వాసం పెరిగింది.

అయితే విజయం పట్ల ఇంతే విశ్వాసంతో ఉన్నారు బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ బాబు. వీరితో పాటు మరికొంతమంది స్వతంత్రులు కూడా పోటీలో ఉన్నారు. రేపు ఈ ఎన్నిక కౌంటింగ్ జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.