యాప్నగరం

లండన్ విమాన ఘటన: పైలెట్లదే తప్పా?

అయిదు రోజుల క్రితం ముంబై నుంచి లండన్ వెళ్లిన విమానం దారి మధ్యలో తప్పిపోయింది.

TNN 21 Feb 2017, 1:11 pm
అయిదు రోజుల క్రితం ముంబై నుంచి లండన్ వెళ్లిన విమానం దారి మధ్యలో తప్పిపోయింది. దాని నుంచి ఎలాంటి సందేశాలు ఏటీసీకి రాలేదు. ఏటీసీతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో ఆ విమానం కూలిపోయిందేమో, ఉగ్రవాదులు హైజాక్ చేశారేమో ఇలా... చాలా అనుమానాలు వచ్చాయి. 33 నిమిషాల పాటూ విమాన జాడ తెలియకపోయేసరికి జర్మనీకి చెందిన ఫైటర్ జెట్స్ విమానాన్ని వెతికేందుకు గగనతలంలోకి ఎగిశాయి. కొన్ని నిమిషాలకే విమానాన్ని కనుగొని... సురక్షితంగా ఉంతన్న సందేశాన్ని పంపిచాయి. ఆ విమానంలో 330 మంది ప్రయాణికులు ఉన్నారు... అందుకే అంతా ఆందోళన చెందారు. ఇంతకీ 33 నిమిషాల పాటూ ఏం జరిగింది? అసలెందుకు విమానం జాడ తెలియకుండా పోయింది?
Samayam Telugu jet mid air scare 1 pilot slept other on wrong frequency
లండన్ విమాన ఘటన: పైలెట్లదే తప్పా?


జెట్ ఎయిర్ వేస్ కి చెందిన 9w118 విమానం ఫిబ్రవరి 16న ముంబై నుంచి లండన్ బయలుదేరింది. అయితే అయిదు వందల కిలోమీటర్లు ప్రయాణించిన వరకు అంతా బాగానే ఉంది. చెక్ రిపబ్లిక్ దేశం దాటి జర్మనీలో ప్రవేశిస్తున్న సమయంలో విమానం జాడ తెలియకుండా పోయింది. జర్మనీ ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) విమానంతో అనుసంధానమయ్యేందుకు చూసినా ఫలితం లేదు. దీంతో జర్మనీ జెట్ ఫైటర్స్ రంగంలోకి దించింది. అయితే విమానంలో పైలెట్ల తప్పిదం వల్ల ఆ 33 నిమిషాల గందరగోళం ఏర్పడినట్టు సమాచారం. ఇద్దరు పైలెట్లలో ఒకరు అధికారికంగా విశ్రాంతి తీసుకుంటుండగా, మరో పైలెట్ తప్పు ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేసినట్టు తెలుస్తోంది. దాని వల్ల అతని హెడ్ సెట్ వాల్యూమ్ కూడా చాలా తగ్గిపోయి... ఏటీసీతో అనుసంధానం అవ్వలేకపోయాడు. జర్మనీ జెట్ ఫైటర్స్ వచ్చాక వారి సాయంతో తిరిగి ఏటీసీకి అందుబాటులోకి వచ్చింది విమానం. అప్పటికీ జర్మనీ గగన తలంలోకి ప్రవేశించి ఫ్లైట్.

ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. దీంతో జెట్ ఎయిర్ వేస్ కు చెందిన ప్రతినిధి ఆ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.