యాప్నగరం

రెచ్చిపోయిన దోపిడీ దొంగలు... తుపాకులతో బెదిరించి చోరీ

బీహార్‌లో కొంతమంది దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. జ్యూయలరీ షాపులోకి తుపాకులతో చొరబడి మొదట వినియోగదారులను ఇబ్బందులకు గురి చేశారు. తర్వాత షాపు యజమానిని తీవ్రంగా కొట్టారు. తుపాకీలో బెదిరిస్తూ షాపులోని నగలను తమ బ్యాగుల్లో వేసుకున్నారు. షాపు యజమానిపై కాల్పులు జరిపి.. ఆయన్ని చంపేశారు. ఈ ఘటనకు సంబంధించిన మొత్తం వీడియో సీసీ ఫుటేజీలో రికార్డ్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దానిలో దుండగులు ఎంత దారుణంగా ప్రవర్తించారో తెలుస్తుంది.

Authored byAndaluri Veni | Samayam Telugu 26 Jun 2022, 5:16 pm

ప్రధానాంశాలు:

  • బీహార్‌లోని జ్యూయలరీ షాపులో దొంగతనం
  • తుపాకులతో చొరబడిన ముఠా
  • జ్యూయలరీ షాపు యజమానిపై కాల్పులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. తుపాకులతో బెదిరించి చోరీ
బీహార్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఒక ముఠా అతి కిరాతకంగా దొంగతనానికి పాల్పడింది. జ్యూయలరీ షాపులోకి చొరబడి.. తుపాకీలతో బెదిరించి.. బంగారు నగలను దోచుకెళ్లారు. షాపు యజమానిని పొట్టనబెట్టుకున్నారు. ఈ చోరీ జూన్ 22వ తేదీన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
బీహార్ హజిపూర్‌లో రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు తుపాకులను పట్టుకుని నీలం జ్యూయలరీ షాపులోకి ప్రవేశించారు. షాపులోకి ప్రవేశించిన వెంటనే తుపాకీలను బయటకు తీసి కస్టమర్లను వేధింపులకు గురి చేశారు. అయితే షాపు యజమాని సునీల్ ప్రియదర్శి వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దోపిడి జరగకుండా ఆపడానికి ప్రతిఘటించాడు. కానీ దుండగులు అతనిని దారుణంగా కొట్టారు. తుపాకులతో బెదిరింపులకు పాల్పడ్డారు. అదే సమయంలో షాపులో ఉన్న బంగారు నగలను తమ బ్యాగుల్లో నింపుకున్నారు. ఈ గొడవలో సునీల్ ప్రియదర్శిని కాల్చి చంపారు.


ఈ ఘటనతో నగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనిపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తక్షణ విచారణకు ఆదేశించారు. అలాగే నగల దుకాణం ఉన్న ప్రాంతంలోనూ ఇతర ప్రాంతాల్లో అదనపు భద్రత కోసం బలగాలను మోహరించారు. ఈ చోరీకి సంబంధించిన పూర్తి దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

అయితే బీహార్‌లో ఇలాంటి సంఘటనలు పరిపాటిగా జరుగుతూనే ఉన్నాయి. గత ఏప్రిల్‌లో ఛప్రా జిల్లాలోని అమ్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పురా సూపర్ మార్కెట్‌లోని ఓ కిరాణా షాపులో దోపిడీ జరిగింది. ఇద్దరు దొంగలు కస్టమర్ల స్టైల్లో షాపులోకి చొరబడి.. పిస్టోల్స్‌తో బెదిరించి షాపు యజమాని నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగానే షాప్ కీపర్‌ను తుపాకీతో కాల్చేశారు. తర్వాత కౌంటర్‌లో డబ్బులు తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.