యాప్నగరం

తీవ్రవాదుల దుశ్చర్య: జవాన్‌ అపహరణ..

రంజాన్ మాసం సందర్భంగా కశ్మీర్‌లో భద్రత బలగాలే లక్ష్యంగా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పూల్వామా జిల్లాలో జవాన్‌ను తీవ్రవాదులు అపహరించుకొని వెళ్లారు.

TNN 14 Jun 2018, 9:28 pm
రంజాన్ మాసం సందర్భంగా కశ్మీర్‌లో భద్రత బలగాలే లక్ష్యంగా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పూల్వామా జిల్లాలో జవాన్‌ను తీవ్రవాదులు అపహరించుకొని వెళ్లారు. ఈ ఘటన దక్షిణ కశ్మీర్‌లోని పూల్వామా జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం (జూన్ 14) సెలవు మీద ఇంటికి వెళ్తున్న ఆర్మీ జవానును ఉగ్రవాదులు అపహరించారు. అపహరణకు గురైన జవానును 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన రైఫిల్‌మెన్‌ ఔరంగజేబుగా గుర్తించారు. హిజ్బుల్‌ ఉగ్రవాది సమీర్‌ టైగర్‌ ఎన్‌కౌంటర్‌లో ఔరంగజేబు కీలక పాత్ర పోషించారు.
Samayam Telugu jawan


మరోవైపు గురువారం ఉదయం సీఆర్పీఎఫ్ పార్టీ గ్యాంగూ‌పై తీవ్రవాదులు దాడులు చేశారు. గత రెండు రోజుల్లో బందిపొరా, షోపియాన్ జిల్లాలో వరుస ఎన్‌కౌంటర్లు జరిగాయి. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎన్‌కౌంటర్లకు ప్రతిదాడిగానే ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. జవాన్‌ అపహరణకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.