యాప్నగరం

బస్సు టైరు పేలి ఘోర ప్రమాదం.. 16 మంది దుర్మరణం

Jodhpur: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సు టైరు పేలి ఎదురుగా వస్తున్న బొలెరోను ఢీకొట్టడంతో 16 మంది దుర్మరణం పాలయ్యారు.

Samayam Telugu 27 Sep 2019, 6:19 pm
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టైరు పేలిపోవడంతో ఓ మినీ బస్సు ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు వాహనాలు గంటకు 100 కి.మీ.లకు పైగా వేగంతో ఉన్నాయి.
Samayam Telugu jodhpur


ప్రమాద స్థలి భీతావహంగా మారింది. బొలెరో వాహనం నుజ్జునుజ్జయింది. ఇరు వాహనాల్లో మృతదేహాలు ఇరుక్కుపోయాయి. రహదారి రక్తసిక్తమైంది. క్షతగాత్రుల ఆర్తనాదాలు పలువురిని కంటతడి పెట్టించాయి.

Also Read: పీవీ ఎక్స్‌ప్రెస్ వే డేంజర్ బెల్స్.. వాహనదారుల్లో భయం

సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకొని సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Must Read: విద్యార్థినుల ఫోటోలు తీసి పోర్న్ సైట్లలో.. హైదరాబాద్‌ యువతి దారుణం

జైసల్మీర్ - జోధ్‌పూర్ హైవే పై శుక్రవారం (సెప్టెంబర్ 27) మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.