యాప్నగరం

జర్నలిస్టును కాల్చి చంపిన జవాన్

జర్నలిస్టులపై హత్యోందంతాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా త్రిపురలో సుదిప్ దత్తా బోమిక్ (49) అనే జర్నలిస్టు అనుమానాస్పద రీతిలో మృత్యువాతపడ్డారు. రాష్ట్రీయ రైఫిల్‌ రెండో బెటాలియన్‌కు చెందిన ఓ సైనికుడు కాల్పులకు పాల్పడటంతో ఆయన దుర్మరణం పాలయ్యారు.

TNN 21 Nov 2017, 8:05 pm
జర్నలిస్టులపై హత్యోందంతాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా త్రిపురలో సుదిప్ దత్తా బోమిక్ (49) అనే జర్నలిస్టు అనుమానాస్పద రీతిలో మృత్యువాతపడ్డారు. రాష్ట్రీయ రైఫిల్‌ రెండో బెటాలియన్‌కు చెందిన ఓ సైనికుడు కాల్పులకు పాల్పడటంతో ఆయన దుర్మరణం పాలయ్యారు. అగర్తలాలోని ఆర్‌కే నగర్ ప్రాంతంలో సుదిప్ మంగళవారం (నవంబర్ 21) మధ్యాహ్నం.. కమాండెంట్ తపన్ దేవ్‌వర్మను కలవడానికి వెళ్లారు. ఈ సమయంలో ఆయన కమాండెంట్ ఆఫీస్ సిబ్బంది తమ బాస్‌ను కలవడానికి వీల్లేదంటూ సుదిప్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో సిబ్బందిలో ఒకరితో సుదిప్‌కు వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన రైఫిల్‌మ్యాన్ నందా ర్యాంగ్ అతడిపై కాల్పులు జరిపాడు.
Samayam Telugu journalist shot dead by tripura state rifles jawan
జర్నలిస్టును కాల్చి చంపిన జవాన్


తోటి జవాన్లు వారిస్తున్నా.. నందా తన తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు సుదిప్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన అప్పటికే మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.