యాప్నగరం

ఆ జర్నలిస్టులకు జైలుశిక్ష విధించిన అసెంబ్లీ

శాసనసభ్యుల ప్రతిష్టకు భంగం కల్గించేలా వార్తలు రాశారన్న ఆరోపణలపై ఇద్దరు జర్నలిస్టులకు కర్ణాటక

Samayam Telugu 22 Jun 2017, 4:21 pm
శాసనసభ్యుల ప్రతిష్టకు భంగం కల్గించేలా వార్తలు రాశారన్న ఆరోపణలపై ఇద్దరు జర్నలిస్టులకు కర్ణాటక అసెంబ్లీ ఏడాదికాలంపాటు జైలుశిక్ష విధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. అసెంబ్లీ స్పీకర్ కేబీ కొలివాడ్ సదరు జర్నలిస్టులకు సంవత్సరకాలంపాటు జైలు శిక్షతోపాటు రూ.10వేలు జరిమానా చెల్లించాలని అసెంబ్లీలో వెల్లడించారు.
Samayam Telugu journalists imposed jail term by karnataka speaker
ఆ జర్నలిస్టులకు జైలుశిక్ష విధించిన అసెంబ్లీ


‘హయ్ బెంగళూరు’ పత్రిక నడిపే రవి బెలగరే, ‘యెలహంక వాయిస్’ జర్నలిస్టు అనిల్ రాజ్ లు ఎమ్మెల్యేలను అగౌరవపరుస్తూ వార్తలు, వరుస కథనాలు రాశారని, వారికి ఏడాది కాలం జైలుశిక్ష విధించడంతో పాటు రూ.10వేలు జరిమానా విధించాలని ప్రివిలెజ్ కమిటీ స్పీకర్ కు సిఫారసు చేయగా... స్పీకర్ ఆ నివేదికను ఆమోదించారు. హై బెంగళూరు పత్రికలో సెప్టెంబర్ 2014లో స్పీకర్ కొలివాడ్ కు కూడా వ్యతిరేక కథనాలు రాసినట్లు ప్రివిలేజ్ కమిటీ గుర్తించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.