నాగపూర్కు చెందిన స్థానిక విలేకరి రవికాంత్ కాంబ్లే తల్లి ఉషా కాంబ్లె(52), కుమార్తె రాశి (1)లను గుర్తు తెలియని దుండగులు దారునంగా హతమార్చారు. వీరిద్దరూ గత కొద్ది రోజులుగా కనిపించడం లేదు. దీనిపై రవికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం బహదురాలోని ఓ మురుగు కాలువలో వారిద్దరి మృత దేహాలు లభ్యమయ్యాయి. వారి శరీరాలపై గాయాలు ఉన్నాయి. దుండగులు వారిపై కత్తులతో దాడి చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
విలేకరి తల్లి, కుమార్తె దారుణ హత్య!
విలేకరి తల్లిని, ఏడాది వయస్సు ఉన్న కుమార్తెను దుండగులు హత్య చేసి, మురుగు కాలువలో పడేసిన దారుణ ఘటన ఇది.
TNN 18 Feb 2018, 8:53 pm