యాప్నగరం

నిర్భయ కేసు విచారణ.. సొమ్మసిల్లిన సుప్రీం జడ్జి

నిర్భయ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు జడ్జి ఆర్.భానుమతి సొమ్మసిల్లారు. తన కుర్చీలోనే ఆమె స్పృహ తప్పారు. దీంతో సిబ్బంది వెంటనే ఆమెను కోర్టు హాల్ నుంచి బయటకు తీసుకెళ్లారు.

Samayam Telugu 14 Feb 2020, 3:01 pm
నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురు ఉరిశిక్షను రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ఎదుట ఉన్న అన్ని న్యాయపరమైన మార్గాలను ఉపయోగించుకుంటున్నారు. నిర్భయ దోషులను ఉరిపై ట్రయల్ కోర్టు స్టే ఇవ్వగా.. హైకోర్టు దాన్ని సమర్థించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. కేంద్రం సుప్రీం కోర్టు మెట్లెక్కింది. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ జరుగుతున్న సమయంలో జస్టిస్ ఆర్.భానుమతి సొమ్మసిల్లి పడిపోయారు.
Samayam Telugu justice-r-banumathi


దీంతో భద్రతా సిబ్బంది ఆమెను కోర్టు రూం నుంచి బయటకు తీసుకెళ్లి వైద్య సాయం అందించారు. అనంతరం స్పృహలోకి వచ్చిన ఆమెను తిరిగి ఛాంబర్‌లోకి తీసుకొచ్చారు. జడ్జి సొమ్మసిల్లి పడిపోవడంతో కేసును వాయిదా వేశారు.

మరోవైపు తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ వినయ్ శర్మ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం వినయ్ శర్మ అభ్యర్థనను తిరస్కరించింది. అతడు మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడన్న వాదనతో న్యాయస్థానం విభేదించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.