యాప్నగరం

పరీక్షలో వివాదస్పద ప్రశ్న.. సోషల్ మీడియాలో రచ్చ!

పట్వారీ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షలో అడిగిన ఓ ప్రశ్న వివాదాల తేనె తుట్టెను రేపింది. ఇది పాకిస్థాన్ వాదనలకు బలాన్ని ఇచ్చేదిగా ఉంది.

TNN 26 Feb 2018, 4:36 pm
జమ్మూ కశ్మీర్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్షల్లో అడిగిన ఓ ప్రశ్న ఇప్పుడు వివాదస్పందంగా మారింది. పట్వారీ ఉద్యోగానికి నిర్వహించిన పరీక్షలో అజాద్ కశ్మీర్ అనే పదాన్ని ముద్రించినట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బోర్డ్ చైర్మన్ సిమ్రన్‌దీప్ సింగ్ విచారణకు ఆదేశించారు. భూగోళశాస్త్రం నిపుణుడిని దీనిపై వివరణ కోరామని, ఎందుకు అతడిపై జరిమానా విధించకూడదో కారణాలను వివరించాలని అడిగినట్లు తెలియజేశారు. పట్వారీ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షా పత్రంలో ఇచ్చిన 86 వ ప్రశ్న ఇప్పుడు వివాదాస్పదమైంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)ను ‘స్వతంత్ర కశ్మీర్’ అంటూ ఇందులో పేర్కోవడం పట్ల పెను దుమారం రేగుతోంది.
Samayam Telugu k exam refers to pok as azad kashmir in paper inquiry ordered
పరీక్షలో వివాదస్పద ప్రశ్న.. సోషల్ మీడియాలో రచ్చ!


కశ్మీర్‌లోని కొంత భాగాన్ని అక్రమంగా పాకిస్థాన్ స్వాధీనం చేసుకున్న ప్రాంతమే పీఓకే. దీన్ని స్వతంత్ర కశ్మీర్ పేరుతో పాకిస్థాన్ పిలుస్తోంది. లోయలోని ఉత్తర ప్రాంతాల్లో తన సైనిక ఉనికిని, తీవ్రవాద చర్యలను సమర్థించికునేందుకు దీన్ని ప్రచారంగా ఉపయోగించుకుంటోంది.

ఉత్తర, తూర్పు దిశలో చైనాతో అంతర్జాతీయ సరిహద్దు కలిగిన జమ్మూ కశ్మీర్‌ను పాక్ అధీనంలో ఉన్న అజాద్ కశ్మీర్, గిల్గిత్-బాల్టిస్థాన్ నుంచి నియంత్రణ రేఖ వద్ద వేరు చేసే ప్రాంతం ఏంటి? అని పరీక్షా పత్రంలో పేర్కొంది. ఈ ప్రశ్నకు దిగువ ఇచ్చిన వికల్పాల్లో ఒకటి సరైన సమాధానమని తెలిపింది. 1) ఉత్తర, ఈశాన్యం 2) దక్షిణ, ఆగ్నేయం 3) తూర్పు, ఈశాన్యం 4) పశ్చిమ, వాయవ్య అనే నాలుగు వికల్పాలను ఇచ్చారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.