దేశంలో హిందూ ఉగ్రవాదం ఉందంటూ వ్యాఖ్యానించిన ప్రముఖ నటుడు కమలహాసన్పై బీజేపీ మండిపడింది. హిందూ ఉగ్రవాదం అన్న పదం వాడినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. కమల్ మానసిక ఆరోగ్యం బాగోలేదని... వెంటనే ఆసుపత్రిలో చేర్పించి, ఆయనకు చికిత్స అందించాలని బీజేపీ సీనియర్ నేత వినయ్ కటియార్ విమర్శించారు. రాజకీయాలు ఇంత దారుణంగా దిగజారడం మంచిది కాదని హితవు పలికారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే కమల్ విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కమల్ పై పరువునష్టం దావా వేసే అంశాన్ని కూడా తమిళనాడు బీజేపీ పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందని కమల్ ఆరోపించిన కమల్ వీరిని అడ్డుకోవడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.
గుజరాత్, యూపీ, రాజస్థాన్లలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై వికటన్ పత్రికలో ఆయన రాసిన వ్యాసం దుమారం రేపుతోంది. హిందూ సంస్థలు గతంలో హింసకు పాల్పడేవి కాదని, మాటలతోనే ప్రత్యర్థులను ఎదుర్కొనేవని, ఇప్పుడు మాత్రం భౌతిక దాడులకు కూడా తెగబడుతున్నాయని కమల్ తన కథనంలో పేర్కొన్నారు. ఒకప్పుడు సత్యం ఒంటరిగా విజయం సాధించేది. కానీ ఇప్పుడు శక్తి ఒక్కటే గెలుస్తోంది. ఇది ప్రజల్ని అమానుషంగా తయారుచేస్తోంది’హిందూ ఉగ్రవాదులను కొందరు వెనుక నుంచి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అలాగే హిందుత్వ శక్తులను అణచివేసి, మతపరమైన అల్లర్లకు అడ్డుకట్టవేయడంలో కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కమల్ కొనియాడారు. ఈ విషయంలో తమిళనాడుతో పోలిస్తే కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయన్నారు. కమల్ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట వేడి పుట్టిస్తున్నాయి.
గుజరాత్, యూపీ, రాజస్థాన్లలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై వికటన్ పత్రికలో ఆయన రాసిన వ్యాసం దుమారం రేపుతోంది. హిందూ సంస్థలు గతంలో హింసకు పాల్పడేవి కాదని, మాటలతోనే ప్రత్యర్థులను ఎదుర్కొనేవని, ఇప్పుడు మాత్రం భౌతిక దాడులకు కూడా తెగబడుతున్నాయని కమల్ తన కథనంలో పేర్కొన్నారు. ఒకప్పుడు సత్యం ఒంటరిగా విజయం సాధించేది. కానీ ఇప్పుడు శక్తి ఒక్కటే గెలుస్తోంది. ఇది ప్రజల్ని అమానుషంగా తయారుచేస్తోంది’హిందూ ఉగ్రవాదులను కొందరు వెనుక నుంచి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అలాగే హిందుత్వ శక్తులను అణచివేసి, మతపరమైన అల్లర్లకు అడ్డుకట్టవేయడంలో కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కమల్ కొనియాడారు. ఈ విషయంలో తమిళనాడుతో పోలిస్తే కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయన్నారు. కమల్ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట వేడి పుట్టిస్తున్నాయి.