యాప్నగరం

రాజ‌కీయాల్లోకి క‌న్న‌య్య కుమార్

జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి నేత రాజ‌కీయాల్లోకి రానున్నారు. అడ‌పా ద‌డ‌పా రాజ‌కీయ కార్య‌క‌లాపాల్లో ఇదివ‌ర‌కూ పాల్గొన్న‌ప్ప‌టికీ ఇంత‌వ‌ర‌కూ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఆయ‌న నేరుగా పాల్గొంది లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న ఒక పార్టీ నుంచి పోటీచేస్తార‌ని ప్ర‌చారం ఊపందుకుంది.

Samayam Telugu 3 Sep 2018, 12:40 pm
ఢిల్లీ జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వామపక్ష విద్యార్థి నేత కన్నయ్య కుమార్‌ ఎంపీగా పోటీ చేయనున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన స్వస్థలమైన బిహార్‌లోని బెగుసరై లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నట్లు బిహార్‌ సీపీఐ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సింగ్‌ ప్రకటించారు.
Samayam Telugu విద్యార్థి నేత క‌న్న‌య్య కుమార్


సీపీఐ నుంచి ఆయన పోటీ చేస్తారని, దీనికి వామపక్ష పార్టీల మద్దతు తెలిపినట్లు ఆదివారం ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన మిత్రపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, ఆర్జేడీ పార్టీలు కూడా కన్నయ్య కుమార్‌కు మద్దతు తెలిపాయని వెల్లడించారు. ఆర్జేడీ ఛీప్‌ లాలు ప్రసాద్‌ యాదవ్‌ గతంలోనే ఆయన పేరును ప్రతిపాధించారని, ఆయన సూచన మేరకు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా కన్నయ్య కుమార్‌ పోటీ చేయనున్నట్లు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.