యాప్నగరం

మహిళా మెజిస్ట్రేట్ అనుమానాస్పద మృతి

కాన్పూర్లోని ఒక మహిళా మ్యాజిస్ట్రేట్ అనుమానాస్పద స్థితిలో మరణించారు.

TNN 9 Oct 2016, 11:47 pm
కాన్పూర్లోని ఒక మహిళా మ్యాజిస్ట్రేట్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ప్రతిభా గౌతమ్ అనే మ్యాజిస్ట్రేట్ కాన్పూర్లోని సర్క్యూట్ హౌజ్ కాలనీలోని తన అధికారిక నివాసంలో ఆదివారం ఉదయం రక్తపుమడుగులో మరణించి కనిపించారు. అయితే, ఆమె మరణానికి కారణాలు ఏమిటనేది ఇంకా తెలియలేదు. ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భర్త అభిప్రాయపడుతున్నప్పటికీ మ్యాజిస్ట్రేట్ తల్లితండ్రులు మాత్రం అతని వాదనతో ఏకీభవించలేదు. తమ అల్లుడే ఆమెను హతమార్చి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu kanpur district magistrate found dead under mysterious circumstances
మహిళా మెజిస్ట్రేట్ అనుమానాస్పద మృతి


ప్రతిభా గౌతమ్ భర్త అభిషేక్ ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఢిల్లీ నుండి మీరట్లోని తన భార్య ఉంటున్న ఇంటికి వచ్చానని, ఇంట్లో అడుగుపెట్టగానే తన భార్య ఉరివేసుకుని కనిపించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తానే తన భార్య మృతదేహాన్ని తాడునుండి విడదీసి మంచంపై పడుకోబెట్టినట్లు చెప్పారు. కానీ, మ్యాజిస్ట్రేట్ తల్లితండ్రులు మాత్రం దాన్ని తోసిపుచ్చారు. తన అల్లుడికి, కుమార్తెకు మధ్య చాలాకాలంగా మనస్ఫర్దలున్నాయని, అతగాడే ఆమెను హతమార్చి ఉంటాడని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.