యాప్నగరం

డీకే శివ కుమార్‌కు కరోనా పాజిటివ్.. హాస్పిటల్లో చేరిక

KPCC Chief, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివ కుమార్ కరోనా బారిన పడ్డారు. దీంతో చికిత్స కోసం ఆయన బెంగళూరులోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చేరారు.

Samayam Telugu 25 Aug 2020, 2:34 pm
కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కరోనా బారిన పడ్డారు. కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో చికిత్స కోసం ఆయన బెంగళూరులోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చేరారు. కన్నడ నాట క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తోన్న శివ కుమార్.. ఇటీవల వరదల బారిన పడిన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ పట్ల మంచి పట్టున్న డీకే కోవిడ్ బారిన పడటంతో కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu DK SHIVA KUMAR
DK Shivakumar


కేపీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ జులై 2న ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ఐదు నెలల క్రితమే అదిష్టానం ఆయన పేరు ప్రకటించినప్పటికీ.. కరోనా కారణంగా ఆయన ఆలస్యంగా బాధ్యతలను స్వీకరించారు. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ఏర్పాటు సమయంలో.. ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో, పార్టీ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించడంలో డీకే కీలక పాత్ర పోషించారు.

డీకే కంటే ముందు కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య కూడా కోవిడ్ బారిన పడ్డారు. వారిద్దరూ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

గత 24 గంటల్లో కర్ణాటకలో కొత్తగా 5851 కరోనా కేసులు నమోదయ్యాయి. 130 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో మొత్తం 197,625 కరోనా కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 81,230 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.