యాప్నగరం

సాయంత్రం మరో ‘బాంబు’ పేల్చనున్న కపిల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.2కోట్లు లంచం తీసుకోవడం కళ్లారా చూశానని ప్రకటించిన ‘ఆప్’

TNN 8 May 2017, 3:59 pm
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.2కోట్లు లంచం తీసుకోవడం కళ్లారా చూశానని ప్రకటించిన ‘ఆప్’ బహిష్కృత నేత కపిల్ మిశ్రా మరో బాంబు పేల్చారు. ఇవాళ సాయంత్రం 5గంటలకు ముఖ్యమైన ప్రకటన చేస్తానని వెల్లడించి పార్టీలో కలకలం రేపారు.
Samayam Telugu kapil mishra threats again says important announcement at 5pm
సాయంత్రం మరో ‘బాంబు’ పేల్చనున్న కపిల్


కేజ్రీవాల్ లంచం తీసుకున్నట్లు తన వద్ద ఆధారాలున్నాయని, వాటర్ ట్యాంకర్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న కపిల్ శర్మ.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సహా అవినీతి నిరోధక శాఖలకు ఫిర్యాదు చేశారు. కపిల్ చేసిన ఆరోపణలపై ఏసీబీ చీఫ్ ముకేష్ మీనా లెఫ్టినెంట్ గవర్నర్ ను సోమవారం ఉదయం కలిసి బ్రీఫింగ్ ఇచ్చారు.

‘సాయంత్రం 5 గంటలకు ముఖ్యమైన ప్రకటన’ అంటూ కపిల్ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.

Important announcement at 5 pm today— Kapil Mishra (@KapilMishraAAP) May 8, 2017
అటు పార్టీని ఇరకాటంలోకి నెట్టడానికే కపిల్ శర్మ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.

లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఢిల్లీ బీజేపీ, కాంగ్రెస్ లు డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.