యాప్నగరం

కరణ్ నగర్ ఎన్‌కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌లోని కరణ్ నగర్‌లో సోమవారం (ఫిబ్రవరి 12) ఉదయం నుంచి కొనసాగిన ఎన్‌కౌంటర్‌ ముగిసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో భారత భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

TNN 13 Feb 2018, 5:53 pm
శ్రీనగర్‌లోని కరణ్ నగర్‌లో సోమవారం (ఫిబ్రవరి 12) ఉదయం నుంచి కొనసాగిన ఎన్‌కౌంటర్‌ ముగిసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో భారత భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో దాక్కొని ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో జమ్మూ కశ్మీర్‌కు చెందిన మరో పోలీసు కూడా గాయపడ్డారు.
Samayam Telugu karan nagar encounter ends 2 terrorists killed
కరణ్ నగర్ ఎన్‌కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు హతం


భవనంలో దాక్కున్న ముష్కరుల్లో ఒకడు మరో భవనానికి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో సైన్యం కాల్పులు జరిపి హతమార్చింది. భవనాన్ని చుట్టుముట్టి మరో ఉగ్రవాదిని మట్టుబెట్టింది.

సీఆర్‌పీఎఫ్‌ శిబిరంపై ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించగా.. సైన్యం సమర్థంగా అడ్డుకుంది. సోమవారం ఉదయం సీఆర్‌పీఎఫ్‌ శిబిరం సమీపంలో ఏకే 47 తుపాకులు, భారీ ఆయుధాలతో కూడిన బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను గస్తీ కాస్తున్న ఓ జవాను గుర్తించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.