యాప్నగరం

పాక్... 1971 నాటి సంగతి మరిచావా?

ఉగ్రవాదాన్ని తన ప్రభుత్వ విధానంగా పాకిస్థాన్ మార్చుకుందని ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎం వెంకయ్యనాయుడు మండిపడ్డారు.

TNN 23 Jul 2017, 2:41 pm
ఉగ్రవాదాన్ని తన ప్రభుత్వ విధానంగా పాకిస్థాన్ మార్చుకుందని ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎం వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన ‘కార్గిల్ పరాక్రమ పరేడ్’లో పాల్గొన్న ఆయన ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న పాకిస్థాన్ గతాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు. 1971లో జరిగిన యుద్ధంలో ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని ఒకసారి ఆదేశం గుర్తు చేసుకోవాలని వెంకయ్య అన్నారు. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం, సాయం చేయడం ద్వారా పాక్‌కు ఒనగూరేదేమీ ఉండదని అన్నారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమని, దాన్ని వదలుకునే ప్రసక్తే లేదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
Samayam Telugu kargil parakram parade venkaiah naidu warns pakistan
పాక్... 1971 నాటి సంగతి మరిచావా?


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఉగ్రవాదం మానవత్వానికి శత్రువు. దానికి ఏ మతం లేదు. కానీ పాకిస్థాన్‌ తన ప్రభుత్వ విధానంగా ఉగ్రవాదాన్ని మార్చుకుంది' అని ఆయన దుయ్యబట్టారు. కశ్మీర్‌లో ఒక్క అంగుళం భూభాగాన్ని సైతం వదలుకునే ప్రసక్తి లేదని వెంకయ్య తెలిపారు. 1999 మే 5 న కశ్మీర్‌లోని కార్గిల్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీకి చెందిన ఐదురుగు జవాన్లను అపహరించి, చిత్రహింసలకు గురిచేసి హతమార్చింది. అంతేకాదు అదే ఏడాది మే 9 కూడా ఆయుధాలతో మన స్థావరాలపై దాడిచేసింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ ద్రాస్, కాక్సార్, మషోహోక్ సెక్టార్‌లపై కాల్పులకు తెగబడటంతో మే 15 న భారత దళాలు పాక్‌పై ప్రతిదాడి చేశాయి. మే 26 నుంచి వైమానిక దాడులను ఐఏఎఫ్ ప్రారంభించింది. వేద ప్రకాశ్ మాలిక్ నేతృత్వంలోని భారత సైన్యం ధీటుగా ఎదుర్కోవడం పాక్ పలాయనం చిత్తగించింది. 1999 జులై 26 తో ఈ యుద్ధం ముగిసింది. సుమారు రెండు నెలల పాటు జరిగిన ఈ యుద్ధంలో సుమారు 527 మంది జవాన్లు అమరులైయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.