యాప్నగరం

ఒకే దశలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. మే 12 న పోలింగ్

కర్ణాటక శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదలైంది. 224 స్థానాలున్న కర్టాటక శాసనసభకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

TNN 27 Mar 2018, 11:37 am
కర్ణాటక శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదలైంది. 224 స్థానాలున్న కర్టాటక శాసనసభకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. మే 12 న అన్ని నిజయోకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించి, మే 15 న ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొంది. మే 28తో కర్ణాటక శాసనసభ గడువు ముగియనుండగా ఆలోగా ఎన్నికలు నిర్వహించి, కొత్త ప్రభుత్వం ఏర్పడేలా షెడ్యూల్‌ను ఈసీ నిర్ణయించింది. మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్టు తెలిపిన ఎన్నికల కమిషన్, మంగళవారం నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని తెలిపింది. మొత్తం ఓటర్లు 4.96 కోట్ల కాగా వీరి కోసం 56,996 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, 2013 ఎన్నికల కంటే ఇవి 9 శాతం అదనమని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా వీవీప్యాట్‌లను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. ఓటు వేయడానికి వచ్చే దివ్యాంగులకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపింది.
Samayam Telugu కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు


ఏప్రిల్‌ రెండోవారంలో షెడ్యూలును ప్రకటించాలని భావించినా, అంతకు ముందే షెడ్యూలు విడుదల చేసింది. ఇంటర్మీడియట్‌ పరీక్షలు ముగిసిన అనంతరం మే నెలలో ఒకే దశలో ఎన్నికలు ఉంటాయని ఈసీ సూచనప్రాయంగా తెలిపింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ఈ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్నాయి. కాంగ్రెస్ మరోసారి విజయం సాధించి అధికారంలోకి రావాలని భావిస్తుండగా, ఎలాగైనా కర్ణాటక పీఠాన్ని తమ సొంతం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. బీజేపీ ప్రయత్నాలను తిప్పికొట్టాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఇప్పటికే వ్యూహరచన చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.