యాప్నగరం

కర్ణాటక: 72మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రచారంతో హోరెత్తిస్తున్న పార్టీలు... ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల వేటలో ఉన్నాయి. జేడీఎస్ ఇప్పటికే మొదటి జాబితాతో అభ్యర్థుల్ని ప్రకటించగా... తాజాగా బీజేపీ 72మందితో తొలి జాబితాను విడుదల చేసింది.

Samayam Telugu 9 Apr 2018, 7:11 am
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రచారంతో హోరెత్తిస్తున్న పార్టీలు... ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల వేటలో ఉన్నాయి. జేడీఎస్ ఇప్పటికే మొదటి జాబితాతో అభ్యర్థుల్ని ప్రకటించగా... తాజాగా బీజేపీ 72మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ఢిల్లీలో సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ జాబితాను ఫైనల్ చేసింది. ఈ భేటీకి ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు సుష్మా, రాజ్‌నాథ్, అనంత్‌కుమార్, యడ్యూరప్పలు హాజరయ్యారు. సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసి మొదటి జాబితాను విడుదల చేశారు.
Samayam Telugu Karnataka


ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో 150సీట్లలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని యడ్యూరప్పకు అధిష్టానం దిశా నిర్దేశం చేసింది. అందుకే అభ్యర్థుల ఎంపిక, ప్రచారం విషయంలో ఆచితూచి వ్యవహరించాలని సూచించింది. కాంగ్రెస్ ఇప్పటి వరకు అభ్యర్థుల ప్రకటించలేదు. జేడీఎస్ మాత్రం 126మంది అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించింది. అన్ని పార్టీలు ఇప్పుడు అభ్యర్థుల ఎంపికలో తలమునకలవుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీకి మే 12న ఎన్నికలు జరగనున్నాయి. మే 15న ఫలితాలు వెలువడతాయి.
Read This Story Also In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.