యాప్నగరం

కర్ణాటక విషాదం: ఐదుగురి దుర్మరణం, శిథిలాల కింద 20 మంది

కర్ణాటకలో భవనం కూలిన ఘటనలో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద నుంచి ఇప్పటివరకు 56 మందిని బయటకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

Samayam Telugu 20 Mar 2019, 7:07 pm
ర్ణాటకలో భవనం కుప్పకూలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. శిథిలాల కింద ఇంకా 15 నుంచి 20 మంది వ్యక్తులు ఉన్నట్లు భావిస్తున్నారు. అధికారులు శిథిలాల కింద నుంచి ఇప్పటివరకూ 56 మందిని రక్షించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ధార్వాడ్‌లోని కమలేశ్వర్‌ నగర్‌లో మంగళవారం (మార్చి 19) మధ్యాహ్నం నాలుగంతస్తుల ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. భవనంలోని 2, 3 అంతస్తుల్లో నిర్మాణం పూర్తై ఇప్పటికే కొంత మంది అద్దెకు ఉంటున్నారు. కొంత మంది కార్యాలయాలను కూడా నిర్వహిస్తున్నారు. నాలుగో అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణంలో నాసి రకం వస్తువులను వినియోగించడం వల్ల భవనం ఒక్కసారిగా కూలిపోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

భవనం కుప్పకూలడంతో అందులోని ఇళ్లలో నివసిస్తున్న వారితో పాటు పలువురు నిర్మాణ కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. సుమారు 80 మంది వరకూ శిథిలాల కింద చిక్కుకున్నట్లు వార్తలు వచ్చాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం పట్ల కర్ణాటక సీఎం కుమారస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మంత్రులు, అధికారులు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.