యాప్నగరం

కర్ణాటక ట్రాజెడీ: 3 రోజుల పాటు మృత్యువుతో పోరాడి బయటపడ్డ దంపతులు

ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం. మూడు రోజుల పాటు శిథిలాల కింద.. చివరికి ప్రాణాలతో బయటపడ్డ దంపతులు, మరో వ్యక్తి. కర్ణాటకలో మిరాకిల్..

Samayam Telugu 22 Mar 2019, 11:30 pm
ర్ణాటకలోని ధార్వాడలో భవనం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 14 మంది మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన నాలుగో రోజు ఈ ఘటన నుంచి ముగ్గురు వ్యక్తులు మృత్యుంజయులుగా బయటపడ్డారు. వీరిలో ఇద్దరు దంపతులు ఉన్నారు.
Samayam Telugu building


శిథిలాల కింద సుమారు 70 గంటల పాటు మృత్యువుతో పోరాడిన దంపతులను సహాయక సిబ్బం ది క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిని దిలీప్, సంగీతగా గుర్తించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

భవనం శిథిలాల కింద నుంచి శుక్రవారం (మార్చి 22) ఉదయం ఓ వ్యక్తిని సురక్షితంగా బయటకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన 60 గంటల తర్వాత అతడు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. శిథిలాల కింద మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆ వ్యక్తిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.

రెస్క్యూ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 70 మందిని బయటకు తీసుకొచ్చారు. ఘటనాస్థలిలో వైద్య, అత్యవసర సేవల బృందాలను అందుబాటులో ఉంచారు. సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని అగ్నిమాపక, అత్యవసర సేవల అదనపు డీజీపీ సునీల్‌ అగర్వాల్‌ తెలిపారు. భవన శిథిలాల చిక్కుకున్న వారందరినీ బయటకు తీసుకొచ్చామని నిర్ధారించుకున్నాక, శిథిలాలను అక్కడి నుంచి తొలగించే పనులను మొదలు పెడతామని ఆయన చెప్పారు. ప్రత్యేక పరికరాలతో పనులు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

ధార్వాడలోని కుమారేశ్వర లేఅవుట్‌లో మంగళవారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 100 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

ప్రమాదం జరిగిన భవనం కర్ణాటక మాజీ మంత్రి వినయ్‌ కులకర్ణి బంధువులదిగా పోలీసులు గుర్తించారు. నాసిరకం మెటీరియల్‌ వినియోగించడం వల్లే భవనం కూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. భవన యజమానులు నలుగురు పోలీసుల ఎదుట లొంగిపోగా.. భవనం నిర్మించిన ఇంజినీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.