యాప్నగరం

ఎట్టకేలకూ పదవుల లెక్క తేలిందా?

ఎట్టకేలకూ నేడు కర్ణాటక మంత్రి వర్గం కొలువుదీరబోతోంది. నేటి మధ్యాహ్నం 2.12 గంటలకు రాజ్‌భవన్ వేదికగా

Samayam Telugu 6 Jun 2018, 8:35 am
ఎట్టకేలకూ నేడు కర్ణాటక మంత్రి వర్గం కొలువుదీరబోతోంది. నేటి మధ్యాహ్నం 2.12 గంటలకు రాజ్‌భవన్ వేదికగా గవర్నర్ వజుభాయ్ కర్ణాటక మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్‌ల సంకీర్ణంతో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే పది రోజులు గడుస్తున్నా మంత్రి వర్గాన్ని మాత్రం ఏర్పాటు చేయలేకపోయారు. ఈ వ్యవహారంపై అటు కాంగ్రెస్, ఇటు జేడీఎస్‌లు ఎంతో మధనం జరిపి.. చివరకు మంత్రివర్గ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశాయి.
Samayam Telugu karnataka-ministers


ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 18 మంది, జేడీఎస్ ఎమ్మెల్యేలు 9 మంది నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఇరు పార్టీలూ వివిధ సమీకరణాల ఆధారంగా ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇస్తున్నట్టుగా సమాచారం.

కర్ణాటక అసెంబ్లీలో సీట్ల సంఖ్యను బట్టి 34 మంది మంత్రులు ఉండవచ్చు. ఇప్పటికే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిల ఎన్నిక జరిగింది. ఇక ఖాళీల సంఖ్య 32. ఇప్పుడు భర్తీ చేస్తున్నది 27 మంత్రి పదవులను. మరో ఐదు ఖాళీలుగా అలాగే ఉండనున్నాయని తెలుస్తోంది.

ప్రస్తుతానికి 27 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేస్తున్నట్టుగా కొన్ని రోజుల తర్వాత విస్తరణ చేపట్టి మిగతా మంత్రి పదవులను భర్తీ చేస్తారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణతో కుమారస్వామి ప్రభుత్వం పెద్ద పరీక్షనే ఎదుర్కొనబోతోంది. పదవులు లభించకపోతే కొంతమంది అసహనభరితులు అయ్యే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.