యాప్నగరం

ఎస్పీని స్టేజీపైకి పిలిచి క్లాస్ ఇచ్చిన సీఎం

సభా వేదిక వద్దకు చేరుకోగానే అక్కడ బందోబస్తు డ్యూటీలో వున్న జిల్లా ఎస్పీని స్టేజీపైకే పిలిపించుకున్న సీఎం..

TNN & Agencies 21 Apr 2017, 4:05 pm
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకి ఓ ఐపీఎస్ ఆఫీసర్‌పై ఆగ్రహం తన్నుకొచ్చింది. కర్ణాటకలోని మాండ్యలో సీఎం సిద్ధరామయ్య ఓ సభకి హాజరయ్యేందుకు వస్తుండగా బీజేపీ నేతలు నల్ల జండాలు చూపించి నిరసన తెలపడమే సీఎం ఆగ్రహానికి కారణమైంది. వెంటనే సభా వేదిక వద్దకు చేరుకోగానే అక్కడ బందోబస్తు డ్యూటీలో వున్న జిల్లా ఎస్పీని స్టేజీపైకే పిలిపించుకున్న సీఎం.. అతడిపై అక్కడే ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరసనకారులు కాన్వాయ్ దగ్గరగా వచ్చి నల్ల జండాలు చూపుతోంటే తమరు ఏం చేస్తున్నారు అంటూ ఎస్పీపై మండిపడ్డారు.
Samayam Telugu karnataka cm siddaramaiah lashes out at ips officer on stage at mandya
ఎస్పీని స్టేజీపైకి పిలిచి క్లాస్ ఇచ్చిన సీఎం


ఇదిలావుంటే, ఈ ఘటనపై స్పందించిన ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి జీ పరమేశ్వర కూడా ముఖ్యమంత్రినే వెనకేసుకొచ్చారు. ఎస్పీని స్టేజీపైకి పిలిచి మందలించడంలో తప్పే లేదన్న హోంమంత్రి.. 'ఒక వేళ నిరసనకారులు రాళ్లు రువ్వి, అవి కానీ సీఎం వాహనానికి కానీ లేదా సీఎంకి కానీ తగిలి వుంటే అప్పుడేం చేసే వాళ్లు' అని ఎదురు ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.