యాప్నగరం

అనారోగ్యంతో కన్నుమూసిన కర్ణాటక సీఎం తనయుడు

కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తనయుడు రాకేష్ సిద్ధరామయ్య బ్రస్సెల్స్‌లోని యూనివర్శిటీ ఆస్పత్రిలో..

TNN 30 Jul 2016, 4:40 pm
కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తనయుడు రాకేష్ సిద్ధరామయ్య బ్రస్సెల్స్‌లోని యూనివర్శిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఇటీవలే స్నేహితులతో కలిసి బెల్జియం వెళ్లిన రాకేష్ సిద్ధరామయ్య అక్కడే అస్వస్థతకి గురవడంతో స్నేహితులు అతడిని యూనివర్శిటీ ఆస్పత్రిలో చేర్పించారు. రాకేష్‌కి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అతడు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టుగా నిర్ధారించారు. మొదట పరిస్థితి కాస్త విషమంగానే అనిపించినప్పటికీ... శుక్రవారం అతడి పరిస్థితి కుదుటపడినట్టుగా వైద్యులు ప్రకటించారు. పూర్తిగా కోలుకున్న తర్వాత మరింత మెరుగైన వైద్యం అందించడం కోసం మరో ఆస్పత్రికి తరలించే అవకాశం వుందని రాకేష్ సన్నిహితవర్గాలు తెలిపాయి. కానీ ఇంతలోనే ఇలా రాకేష్ సిద్ధరామయ్య చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Samayam Telugu karnataka cm siddaramaiahs son rakesh siddaramaiah died in brussels hospital
అనారోగ్యంతో కన్నుమూసిన కర్ణాటక సీఎం తనయుడు


రాకేష్‌ని పరామర్శించేందుకు గురువారమే పర్సనల్ సెక్రటరీతో కలిసి సీఎం సిద్ధరామయ్య బ్రస్సెల్స్ వెళ్లారు. రాకేష్ తల్లి పార్వతి, ఇతర కుటుంబసభ్యులు కూడా అంతకన్నా ముందే రాకేష్‌ని చూడటం కోసం బ్రస్సెల్స్ వెళ్లారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.