యాప్నగరం

కరోనా నుంచి కోలుకున్న కర్ణాటక సీఎం

Bengaluru: కర్ణాటక సీఎం యడియూరప్ప కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ మహమ్మారి నుంచి ఆయన వారంతో రోజుల్లోనే కోలుకోవడం విశేషం

Samayam Telugu 10 Aug 2020, 6:31 pm
ర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగటివ్‌గా వచ్చింది. దీంతో సోమవారం (ఆగస్టు 10) సాయంత్రం బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Samayam Telugu ముఖ్యమంత్రి యడియూరప్ప
CM Yediyurappa


77 ఏళ్ల యడియూరప్ప 8 రోజుల కిందట కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలుగా అనుమానించి పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్‌గా తేలిందని ఆయన ఆగస్టు 2న తెలిపారు. వైద్యుల సూచన మేరకు హాస్పిటల్‌లో చేరినట్లు వెల్లడించారు. తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని ఆయన ట్వీట్‌ చేశారు. సీఎం యడియూర్పకు కరోనా సోకిన వారం రోజులకు మంత్రి శ్రీరాములు కూడా కరోనా బారినపడ్డారు.

కర్ణాటకలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య కూడా ఈ మహమ్మారి బారినపడ్డారు. అధికార బీజేపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా వైరస్‌ సోకింది.

కర్ణాటకలో ఇప్పటివరకు 1,78,087 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో 93,903 కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం 80,981 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా వైరస్ బారిన పడి ఆ రాష్ట్రంలో 3,198 మంది మరణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.