యాప్నగరం

Hijab Ban: త్వరలో హిజాబ్‌పై నిషేధం ఎత్తివేత.. ఆర్‌ఎస్‌ఎస్‌కు కర్ణాటక సర్కారు వార్నింగ్

Hijab Ban గతేడాది జనవరిలో ఉడుపిలో మొదటిసారి హిజాబ్‌పై వివాదం మొదలైంది. పాఠశాలలు, కళాశాలల్లో యూనిఫాం తప్పనిసరి అని, హిజాబ్ ధరించడానికి మినహాయింపు ఇవ్వలేమని కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కర్ణాటకలో హిజాబ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. ఇదే విషయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. తరువాత, సుప్రీంకోర్టులో ఈ ఉత్తర్వులను సవాల్ చేయడంతో అక్కడ కూడా విభజిత తీర్పు వచ్చింది. అటు, తుది తీర్పు వెలువడే వరకు తరగతులకు హాజరు కావడానికి విద్యార్థులు నిరాకరించారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 25 May 2023, 1:14 pm

ప్రధానాంశాలు:

  • కర్ణాటకలో హిజాబ్‌పై గతంలో బీజేపీ నిషేధం
  • ఉత్తర్వులను ఉపసంహరించే దిశగా కాంగ్రెస్
  • ఎన్నికల్లో హామీపై కర్ణాటక మంత్రి కీలక వ్యాఖ్యలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Hijab
రాష్ట్రంలోని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు, ప్రీ-యూనివర్శిటీ కాలేజీల్లో హిజాబ్‌ను నిషేధిస్తూ గతంలో జారీచేసిన ఉత్తర్వులను ఉపసంహరించాలలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే భజరంగ్‌ దళ్ వంటి సంస్థలను తమ ప్రభుత్వం నిషేధిస్తుందని ఆ రాష్ట్ర సీనియర్ మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. ‘కర్ణాటకను స్వర్గధామంగా మారుస్తామని మా మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం.. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే అది భజరంగ్ దళ్ లేదా మరేదైనా సంఘ్ పరివార్ సంస్థా అని మేం పరిగణించం’ అని స్పష్టం చేశారు.
ప్రత్యేకంగా ఆర్ఎస్ఎస్ విషయంలో ఏం చేస్తారని ప్రశ్నించగా.. ‘ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే.. నిషేధం విధించనప్పటికీ దేశంలోని చట్టం ప్రకారం చర్యలను తీసుకుంటాం’ అని సమాధానం ఇచ్చారు. గత నాలుగేళ్లుగా చట్టానికి, పోలీసులకు భయపడకుండా కొన్ని అంశాలు సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ అధినాయకత్వం ఆమోదయోగ్యం కాదని భావిస్తే వారు పాకిస్థాన్‌కు వెళ్లవచ్చు’’ అని ప్రియాంక్ అన్నారు.

‘గత బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన గోవధ నిషేధం, మత మార్పిడి నిరోధక చట్టాలతో సహా హిజాబ్, పాఠ్యపుస్తకాల సవరణ తదితర వాటిని మేం సమీక్షిస్తాం.. ఈ చట్టాలలో ఏదైనా వివాదాస్పదంగా, మతపరమైన లేదా సామాజిక ఆకృతికి లేదా రాష్ట్ర ప్రతిష్టకు విరుద్ధంగా ఉన్నట్లు మేము గుర్తిస్తే వాటిని రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తాం’ అని ప్రియాంక్ ఖర్గ్ తెలిపారు.

‘రాజ్యాంగ విరుద్ధమైన, వ్యక్తి హక్కులను ఉల్లంఘించే, రాష్ట్ర ప్రతిష్ట, పెట్టుబడి, ఉపాధిని ప్రభావితం చేసే చట్టాన్ని సమీక్షించడంలో మా ప్రభుత్వం దృఢంగా ఉంది. ఆర్థికంగా, సామాజికంగా సమానమైన కర్ణాటకను నిర్మించాలనుకుంటున్నాం. హిజాబ్ సర్క్యులర్ అమలులోకి వచ్చినప్పటి నుంచి 18,000 మంది మైనారిటీ విద్యార్థులు పాఠశాలకు దూరంగా ఉన్నారు. వారు ప్రధాన స్రవంతిలోకి తిరిగి రావాలని, విద్యను కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం’ మంత్రి చెప్పారు.


Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.