సుప్రీం కోర్టు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేసేందుకు సిద్ధమైంది కర్ణాటక ప్రభుత్వం. అది కూడా మైసూరు, మాండ్య వంటి కావేరి పరివాహక ప్రాంతాలకి తాగునీటితోపాటు ఎండిపోతున్న పంటపొలాలకి నీరు అందించేందుకు నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని కర్ణాటక రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు. కావేరి నుంచి 6000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తే అందులో 3000 క్యూసెక్కుల వరకు తమిళనాడుకు చేరుతుంది అని సిద్ధరామయ్య స్పష్టంచేశారు. కావేరి నీటి వివాదం మరింత జఠిలం అవుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా సమావేశమైన కర్ణాటక అసెంబ్లీ... కేవలం తాగునీరు, పంటపొలాలకి అవసరాల కోసం మాత్రమే నీటిని విడుదల చేయాలంటూ తీర్మానం చేసిన అనంతరం సీఎం సిద్ధరామయ్య ఈ ప్రకటన చేశారు.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం సోమవారం రాత్రి 11 గంటల నుంచి క్రిష్ణరాజసాగర్ డ్యామ్ ద్వారా ఈ నిటిని విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. సోమవారం నుంచి ఆరు రోజులపాటు విడుదల చేయనున్న ఈ నీరు శుక్రవారం రాత్రికి బిలిగుండ్లు జలాశయానికి చేరుకుంటాయని... ఆ తర్వాతే కావేరి తమిళనాడుకు పరుగులు తీస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం సోమవారం రాత్రి 11 గంటల నుంచి క్రిష్ణరాజసాగర్ డ్యామ్ ద్వారా ఈ నిటిని విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. సోమవారం నుంచి ఆరు రోజులపాటు విడుదల చేయనున్న ఈ నీరు శుక్రవారం రాత్రికి బిలిగుండ్లు జలాశయానికి చేరుకుంటాయని... ఆ తర్వాతే కావేరి తమిళనాడుకు పరుగులు తీస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.