యాప్నగరం

సీఎం సిద్ధ రామయ్యకూ తప్పని ఓటమి

కర్ణాటక శాసనసభ ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. చాముండేశ్వరిలోని కాంగ్రెస్ అభ్యర్థి, సీఎం సిద్ధ రామయ్య ఓటమి పాలయ్యారు. సమీప ప్రత్యర్థి, జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడ చేతిలో సుమారు 20 వేల పైచిలుక ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Samayam Telugu 15 May 2018, 12:12 pm
Samayam Telugu సిద్ధ రామయ్య
కర్ణాటక శాసనసభ ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. చాముండేశ్వరిలోని కాంగ్రెస్ అభ్యర్థి, సీఎం సిద్ధ రామయ్య ఓటమి పాలయ్యారు. సమీప ప్రత్యర్థి, జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడ చేతిలో సుమారు 20 వేల పైచిలుక ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక రెండో స్థానం బాదామీలో బీజేపీ అభ్యర్థి, బి శ్రీరాములపై సిద్ధ రామయ్య ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి, బీఎస్ యడ్యూరప్ప షికారిపుర నుంచి విజయబావుటా ఎగురవేశారు. వరుణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన సిద్ధూ తనయుడు యతీంద్ర విజయం సాధించారు.

ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి ఎవరి మద్దతు లేకుండానే ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి కాషాయదళం చేరుకుంది. మొత్తం 222 స్థానాల్లో 110 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ 73 స్థానాల్లో, జేడీఎస్ 40 చోట్ల, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మధ్య కర్ణాటకలోని 35 నియోజకవర్గాల్లో బీజేపీ 23 స్థానాల్లో విజయం దిశగా సాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.