యాప్నగరం

మోదీ, షాకు సిద్ధరామయ్య లీగల్ నోటీసులు

అసెంబ్లీ ఎన్నికలతో కర్ణాటకలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. నిన్నటి వరకు మాటల యుద్ధంతో విరుచుకుపడిన కాంగ్రెస్, బీజేపీలు మరింత దూకుడు పెంచాయి.

Samayam Telugu 7 May 2018, 7:43 pm
అసెంబ్లీ ఎన్నికలతో కర్ణాటకలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. నిన్నటి వరకు మాటల యుద్ధంతో విరుచుకుపడిన కాంగ్రెస్, బీజేపీలు మరింత దూకుడు పెంచాయి. బీజేపీ సిద్ధ రామయ్య అవినీతి ఆరోపణలు చేశాడంటూ ఓ రేంజ్‌లో మండిపడింది. దీనికి కౌంటర్‌గా సిద్ధూ లీగల్ నోటీసులు పంపి పెద్ద షాక్ ఇచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ, సీఎం అభ్యర్థి యడ్యూరప్పలకు ఈ నోటీసులు పంపించారు. బీజేపీ ప్రచురించిన ప్రకటనలు, ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలన్నీ తప్పని... తనపై అపవాదులు వేస్తున్నారంటూ నోటీసుల్లో ప్రస్తావించారు. ర్యాలీల్లో, సభల్లో కూడా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రకటలను కూడా ప్రధానంగా తనకు, కాంగ్రెస్ పార్టీకి భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు.
Samayam Telugu Siddaramaiah..


మరోవైపు సిద్ధరామయ్య లీగల్ నోటీసులపై బీజేపీ కూడా స్పందించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తప్పదని గ్రహించి... సిద్ధరామయ్య ఇలా చేస్తున్నారని విమర్శించింది. స్కామ్‌ పేరిట వందల మందిని మోసం చేసిన విజయ్‌ ఈశ్వరన్‌ అనే వ్యాపారవేత్తను సిద్ధరామయ్య రక్షించాలని చూస్తున్నారంటూ బీజేపీ ఆరోపణలు చేసింది. సిద్ధరామయ్య-ఈశ్వరన్‌ ఉన్న ఓ ఫోటోను మీడియాకు విడుదల చేసింది. ఈ స్కామ్‌లో సిద్ధరామయ్యకు కూడా వాటా ఉందని... ఆయన నుంచి బహుమతులు కూడా తీసుకున్నారని విమర్శించింది. ఈ ఆరోపణలతో పాటూ మోదీ, షా, యడ్యూరప్ప వ్యాఖ్యలపై ఈ నోటీసులు పంపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.