యాప్నగరం

మైనింగ్ కేసులో యెడ్యురప్ప నిర్దోషి: సీబీఐ

బళ్లారి గనుల అక్రమ గనుల కేటాయింపు కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్పను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

Samayam Telugu 26 Oct 2016, 12:18 pm
బళ్లారి గనుల అక్రమ గనుల కేటాయింపు కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్పను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
Samayam Telugu karnataka ex cm yeddyurappa acquitted in bellary mining case
మైనింగ్ కేసులో యెడ్యురప్ప నిర్దోషి: సీబీఐ


2012లో యెడ్యురప్పతో పాటు అతని సమీపబంధువులపై బళ్లారి సౌత్ వెస్ట్ మైనింగ్ కంపెనీకి గనులు లీజుకివ్వడంలో ముడుపులు ముట్టాయన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది.

ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలంలో గనుల అక్రమ తవ్వకాలకు అనుమతిచ్చినందుకు..యెడ్యురప్పకు రూ.40కోట్లు ముడుపులు ముట్టాయని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ కేసులో యెడ్యురప్ప మూడు వారాల పాటు జైల్లో ఉండి అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు.

సీఐబీ తనను నిర్దోషిగా ప్రకటించడంపై యెడ్యురప్ప హర్షం వ్యక్తం చేశారు. ‘న్యాయం ఎప్పటికైనా జయిస్తుంది. నాపై కుట్ర జరిగింది. ‘సత్యవే జయతే, నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు’ అని ఆయన తీర్పు అనంతరం ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఆయన కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.