యాప్నగరం

కర్ణాటకలో పడవ బోల్తా.. ఆరుగురి మృతి

ప్రయాణికులతో వెళుతుండగా బోల్తాపడిన పడవ. ప్రమాదం జరిగిన సమయంలో 24మంది పడవలో ఉన్నారు. తొమ్మిది మృతదేహాలను వెలికి తీసిన మత్స్యకారులు. సహాయక చర్యలు ముమ్మరం చేసిన నేవీ

Samayam Telugu 21 Jan 2019, 7:00 pm
కర్ణాటకలో పడవ ప్రమాదం జరిగింది. కార్వార్‌ ప్రాంతంలో కాళీ నదిలో ప్రయాణికులతో వెళుతున్న పడవ బోల్తా పడింది. ఘటనలో తొమ్మిదిమంది చనిపోగా.. మిగిలిన వారు గల్లంతయ్యారు. ప్రమాదం గురించి సమాచారం అందగానే.. మత్స్యకారులు, కోస్ట్‌గార్డులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు మొదలుపెట్టారు. చనిపోయిన ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు.
Samayam Telugu ka.


ప్రమాదం జరిగిన సమయంలో 24మంది పడవలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా అవతలి గట్టు నుంచి తిరుగు ప్రయాణమైన సమయంలో ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సామర్థ్యానికి మించి ప్రయాణికులు పడవ ఎక్కడంతోనే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.