యాప్నగరం

సిద్దూకి కీలక పదవి.. కుమారస్వామి నిర్ణయం!

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు.. కీలకపదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి కుమారస్వామి నిర్ణయించారు. ఇందులో భాగంగా కేబినెట్ హోదాతో ఓ పదవిని కట్టబెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Samayam Telugu 25 Jun 2018, 6:50 pm
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు.. కీలకపదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి కుమారస్వామి నిర్ణయించారు. ఇందులో భాగంగా కేబినెట్ హోదాతో ఓ పదవిని కట్టబెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం సిద్ధరామయ్య సంకీర్ణ ప్రభుత్వ సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ పదవిలో ఈయన సేవలన్నీ ప్రభుత్వానికి బయట నుంచే చేయాలి. ఈ పదవికి అధికారికంగా ప్రత్యేక హోదా అంటూ ఏమీ ఉండదు. అయిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న సిద్ధరామయ్యకు.. సంకీర్ణ ప్రభుత్వంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని కట్టబెట్టాలని సంకీర్ణ ప్రభుత్వం భావిస్తోంది.
Samayam Telugu Siddaramaiah


ప్రభుత్వమే సమన్వయ సమితిని ఏర్పాటు చేసి.. దానికి కేబినెట్ హోదాను ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ విషయమై ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉపముఖ్యమంత్రి పరమేశ్వర సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. సమన్వయ సమితిని ప్రభుత్వమే ఏర్పాటు చేసి.. దానికి సిద్ధరామయ్యను అధ్యక్షుడిగా చేస్తారు.

కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వాన్ని సమన్వయ పరిచేందుకు సోనియాగాంధీని అధ్యక్షురాలిగా చేశారు. ఈపదవిలో సోనియా అత్యంత కీలకపాత్ర పోషించారు. ఇదే తరహాలో ప్రస్తుత కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి సమన్వయ సమితి అధ్యక్షులుగా సిద్ధరామయ్య క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. ఈ సమితి వ్యవహారాల కోసం విధాన సౌధలోనూ ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. కేబినెట్ హోదాలోనే సమన్వయ సమితి అధ్యక్షుడు ప్రభుత్వానికి సలహాలు ఇస్తారు. రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.