యాప్నగరం

కర్ణాటక: కాంగ్రెస్‌ ర్యాలీలో యాసిడ్ దాడి.. 20మందికిపైగా గాయాలు

కర్ణాటక స్థానిక సంస్థల ఎన్నికల విజయోత్సవ ర్యాలీపై యాసిడ్ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కార్యకర్తలపై యాసిడ్ చల్లడంతో.. 20మందికిపైగా గాయపడ్డారు.

Samayam Telugu 3 Sep 2018, 5:15 pm
కర్ణాటకలో కాంగ్రెస్ ర్యాలీపై యాసిడ్ దాడి జరగడం కలకలంరేపింది. దాడిలో 20మందికిపైగా గాయపడగా.. అందర్ని ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థలకు ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. విజయం సాధించిన అభ్యర్థులు కార్యకర్తలు, అనుచరులతో కలిసి విజయోత్సవ ర్యాలీలు జరుపుకుంటున్నారు. తుముకూరు కార్పొరేషన్‌ 16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఇనయతుల్లా విజయం సాధించడంతో సంబరాలు చేసుకున్నారు. గెలిచిన అభ్యర్థితో ర్యాలీగా వెళుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు దూసుకొచ్చారు. యాసిడ్ బాటిల్స్ తీసి ర్యాలీలో కార్యకర్తలపై చల్లారు.
Samayam Telugu Acid Attack.


ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే 20మందికిపైగా గాయపడ్డారు. వెంటనే బాధితుల్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరిద్దరికి తీవ్ర గాయాలయ్యాయని డాక్టర్లు చెబుతున్నారు. ఘటనపై పోలీసులకు కేసు నమోదు చేసి.. దాడి చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. అయితే ఈ దాడి ప్రత్యర్థి పార్టీ నేతల పనిగా అనుమానిస్తున్నారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే యాసిడ్ దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి.. నిందితుల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.