యాప్నగరం

పంచె కట్టి మారథాన్ పరుగు.. కిందపడ్డ మంత్రి

వయసు రీత్యా పెద్దవారైన మంత్రిగారు యువకుడిలా మారిపోయారు. తన పంచెను పైకి లాగి కట్టి ఉత్సాహంగా పరుగు అందుకున్నారు. కొద్ది దూరం వెళ్లగానే పాపం.. పట్టు తప్పి కిందపడిపోయారు.

Samayam Telugu 14 Oct 2018, 5:30 pm
మైసూరులో దసరా ఉత్సవాలు సందడిగా జరుగుతున్నాయి. ప్రత్యేక అతిథులు, సందర్శకుల తాకిడితో సందడి వాతావరణం నెలకొంది. ఆదివారం కావడంతో.. సరదాగా ఓ స్వచ్ఛంద సంస్థ హాఫ్ మారథన్ నిర్వహించింది. ఈ మారథాన్‌లో యువతతో పాటూ సీనియర్ సిటిజన్లు కూడా ఉత్సాహం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కర్ణాటక విద్యాశాఖ మంత్రి జీటీ దేవగౌడ కూడా పరుగులో పాల్గొన్నారు.
Samayam Telugu Run.


వయసు రీత్యా పెద్దవారైన మంత్రిగారు కూడా యువకుడిలా మారిపోయారు. తన పంచెను పైకి లాగి కట్టి ఉత్సాహంగా పరుగు అందుకున్నారు. కొద్ది దూరం వెళ్లగానే పాపం.. పట్టు తప్పి కిందపడిపోయారు. వెంటనే గమనించిన భద్రతా సిబ్బంది.. ఆయన్ను పైకి లేపారు. పాపం అమాత్యులవారి రెండు మోకాళ్లకు దెబ్బలు తగిలాయి. అక్కడే ప్రాథమిక చికిత్స అందించి.. ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.