యాప్నగరం

గుండెపోటుతో మృతి చెందిన కర్ణాటక మంత్రి

కర్ణాటక రాష్ట్ర సహాకార శాఖ మంత్రి మహాదేవ ప్రసాద్ గుండెపోటుతో సోమవారం రాత్రి మరణించారు. ఆయన నిద్రలోనే మృతి చెందినట్లు సిబ్బంది తెలియజేశారు.

TNN 3 Jan 2017, 11:55 am
కర్ణాటక రాష్ట్ర సహకార శాఖ మంత్రి హెచ్‌సీ మహాదేవ ప్రసాద్ సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. 58 ఏళ్ల మహాదేవ ప్రసాద్ చిక్‌మగళూరు జిల్లాలోని ఓ రిసార్ట్స్‌లో సోమవారం రాత్రి గుండెపోటుకు గురైనట్లు ఆయన సిబ్బంది తెలియజేశారు. మంగళవారం చాలాసేపటి వరకు లోపలి నుంచి బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి ఉదయం 8.30 గంటలకు తలుపులు తెరచి చూడగా ఆయన విగజీవుడిగా పడి ఉన్నారు.
Samayam Telugu karnataka minister mahadeva prasad dies following heart attack
గుండెపోటుతో మృతి చెందిన కర్ణాటక మంత్రి


సోమవారం కొప్పమ్ పట్టణంలో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకకు మంత్రి ప్రసాద్ హజరైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత నమ్మకస్తుడైన వారిలో మహాదేవ్ ప్రసాద్‌ కూడా ఒకరు. ఈయన గుండల్పట్టు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అయిదుసారు ఎంఎల్ఏ‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం చామ్‌రాజ్‌నగర్ జిల్లా ఇంఛార్జి మంత్రిగానూ బాధ్యతులు నిర్వహిస్తున్నారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.