యాప్నగరం

గొర్రెల కాపరి తెలివి: మేకలను వదిలేసి కుక్కను ఎందుకు తెచ్చుకున్నాడు?

విపత్కర పరిస్థితుల్లో ఓ గొర్రెల కాపరి సమయస్ఫూర్తి ప్రదర్శించాడు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్ జనరల్ సత్య ప్రధాన్ ట్విటర్‌ ద్వారా అతడి గురించి షేర్ చేశారు.

Samayam Telugu 11 Aug 2020, 1:47 am
భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. డ్యామ్ గేట్లు తెరుస్తుండటంతో వరద నీరు ఊర్లను ముంచెత్తుతోంది. కేరళ, కర్ణాటకలో పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వారికి సహాయం అందిస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించి షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది.
Samayam Telugu గొర్రెల కాపరి (ప్రతీకాత్మక చిత్రం)


ఓ వ్యక్తి తన గొర్రెలను మేత కోసం అడవికి తోడ్కొని వెళ్లాడు. ఇంతలో కృష్ణా నదికి భారీ వరదలు వచ్చాయి. గొర్రెల కాపరి అక్కడ నుంచి బయటపడకపోతే ప్రాణాలకే ముప్పు. అలాంటి దశలో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది అతడికి కదిలే దేవుళ్లలా కనిపించారు. వారి సాయంతో బయటపడుతూ అతడు కీలక నిర్ణయం తీసుకున్నాడు.

తన గొర్రెలను అడవిలోనే వదిలేసి రావడం ఆ కాపరిని తీవ్రంగా బాధించింది. ఆ సమయంలోనూ అతడు తెలివిగా నిర్ణయం తీసుకున్నాడు. తన గొర్రెలను అక్కడే వదిలేసి, తాను పెంచుకుంటోన్న కుక్కను మాత్రం తనతో పాటే తెచ్చుకున్నాడు. గొర్రెలు సులభంగా మేయగలవు. కానీ, కుక్కకు ఆకలేస్తే తనే అహారాన్ని అందించాలి. అందువల్ల కుక్కను తీసుకురావడానికే మొగ్గు చూపాడు.

ఈ ఫోటోను జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) డైరెక్టర్ జనరల్ సత్య ప్రధాన్ ట్విటర్‌ ద్వారా షేర్ చేశారు. ‘అతడికి సహాయం చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రం నా జ్ఞాపకాల్లో ఉండిపోతుంది’ అని ఆయన ట్వీట్ చేశారు.

Also Read: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా.. ఇతర పరీక్షల కోసం వెళ్లగా నిర్ధారణ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.