యాప్నగరం

పిడుగుపాటును ముందుగా హెచ్చరించే యాప్..!

పిడుగుపాటు, వర్షం రాకను అంచనా వేసి సంబంధించిన వివరాలను ముందుగానే తెలిపేలా

TNN 26 May 2017, 6:03 pm
పిడుగుపాటు, వర్షం రాకను అంచనా వేసి సంబంధించిన వివరాలను ముందుగానే తెలిపేలా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఓ యాప్‌ను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఆ రాష్ట్రంలో పిడుగుపాటు వల్ల ఏటా 80 మంది వరకూ మరణిస్తున్నారు. భారత దేశం మొత్తం మీద ఈ కారణంగా.. ఏటా 2500 మంది వరకూ దుర్మరణం పాలవుతున్నారు. ప్రధానంగా రైతులను దృష్టిలో పెట్టుకొని తీసుకురానున్న ఈ యాప్ రూపకల్పన కోసం ఇప్పటికే టెండర్లను కూడా ఆహ్వానించారు. దీని కోసం రూ. 55 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కోటి 100 కిలోమీటర్ల రేడియస్‌తో 13 సెన్సార్లను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.
Samayam Telugu karnataka state to bring an app for forecasting thunderbolt
పిడుగుపాటును ముందుగా హెచ్చరించే యాప్..!


ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఈదురు గాలులతో కూడిన వర్షం, పిడుగుపాటుకు విపత్తుల గురించి 45 నిమిషాల ముందే హెచ్చరించే వీలు కలుగుతుంది. దీని ద్వారా రైతులందరికీ ప్రయోజనం కలుగుతుందని ఆ రాష్ట్ర విపత్తుల పర్యవేక్షణ కేంద్రం డైరెక్టర్ శ్రీ‌నివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 30 లక్షల మంది రైతుల మొబైల్ ఫోన్ నంబర్లు తమ వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు.

ఇటీవల ఏపీలో పిడుగు పడుతుందని ముందుగానే హెచ్చరించి నష్టాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కాకిమడుగు, కొత్తపల్లి గ్రామాల మధ్య మరో అరగంటలో పిడుగు పడుతుందని విపత్తు శాఖ హెచ్చరించింది. చెప్పినట్లే రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఆ గ్రామాల మధ్య పిడుగులు పడ్డాయి. ముందస్తు జాగ్రత్తతో ఆయా గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు.
Read this in Kannada

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.