యాప్నగరం

కర్ణాటకలో బాబు ట్రిక్కులు పనిచేయలేదు: బీజేపీ

కర్ణాటకలో గెలుపుతో దక్షిణాదిన బీజేపీ జైత్రయాత్ర ప్రారంభమయ్యిందంటున్నారు బీజేపీ నేతలు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు ప్రతిపక్షాలను తిరస్కరించారన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్.

Samayam Telugu 15 May 2018, 1:48 pm
కర్ణాటకలో గెలుపుతో దక్షిణాదిన బీజేపీ జైత్రయాత్ర ప్రారంభమయ్యిందంటున్నారు బీజేపీ నేతలు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు ప్రతిపక్షాలను తిరస్కరించారన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. తెలుగువాళ్లు బీజేపీ మద్దతు ఇవ్వకుండా టీడీపీ అడ్డుపడిందని... అయినా అక్కడ కూడా తమ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయమన్నారు. తెలుగు ప్రజలు ఉన్న నియోజకవర్గాల్లో... పార్టీ బలం 6 నుంచి 20కి పెరిగిందని గుర్తు చేశారు. చంద్రబాబు ఎత్తుగడలు కర్ణాటకల పనిచేయలేదని... ఆయన్ను అక్కడి ప్రజలు కూడా తిరస్కరించారని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని రాజకీయాలు చేసినా... బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారన్నారు రామ్ మాధవ్.
Samayam Telugu Ram Madhav


బీజేపీ ఉత్తరాది పార్టీ అనే అపోహలు కర్ణాటకలో గెలుపుతో తొలగిపోయాయన్నారు సినీ నటుడు, పార్టీ నేత కృష్ణంరాజు . తెలుగు ఓటర్లు కూడా బీజేపీకి అండగా నిలిచారని... ఇదే ఉత్సాహంతో 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీ విజయాన్ని ఆపడం ఎవరితరం కాదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.