యాప్నగరం

​చిదంబరం తనయుడి ఆస్తులు.. వామ్మో, ఆ రేంజ్ లోనా!

2006 నుంచి 2014 మధ్యన చిదంబరం కుటుంబం విదేశాల్లో కూడబెట్టిన ఆస్తుల విలువే

TNN 20 May 2017, 11:18 am
యూపీఏ హయాంలో కేంద్ర ఆర్థిక, హోం వంటి శాఖలకు మంత్రిగా వ్యవహరించిన తమిళనాడు రాజకీయ నేత చిదంబరం, ఆయన భార్య, తనయుడు కార్తీ ఆస్తుల గురించి బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి చెబుతున్న నంబర్లు ఆశ్చర్య పరిచే స్థాయిలో ఉన్నాయి. విదేశాల్లో కార్తీ అత్యంత భారీ స్థాయిలో ఆస్తులను కూడబెట్టాడనేది స్వామి ఆరోపణ. కార్తీ, చిదంబరం భార్య శ్రీనిధి పేరిట పద్నాలుగు దేశాల్లో ఆస్తులున్నాయని స్వామి ఆరోపిస్తున్నారు. చిద్దూ తనయుడి, భార్య ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ చెన్నై విభాగం దర్యాప్తు చేసిందని.. భారీ స్థాయిలో ఆస్తులను గుర్తించిందని కూడా స్వామి అంటున్నారు.
Samayam Telugu karthi chidambaram da case
​చిదంబరం తనయుడి ఆస్తులు.. వామ్మో, ఆ రేంజ్ లోనా!


స్వామి కథనం మేరకు.. ఐటీ శాఖ నివేదికల ప్రకారం చిద్దూ కుటుంబం ఆస్తుల విలువ దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల పైనే! ఈ ఆస్తులు ప్రధానంగా బ్రిటన్, దుబాయ్, థాయ్ లాండ్, సింగపూర్, బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్, స్పెయిన్.. వంటి దేశాల్లో విస్తరించి ఉన్నాయి. బ్రిటన్ లో అయితే విస్తారమైన ఫామ్ హౌస్ లున్నాయి.

ఎయిర్ టెల్, మాక్సిస్ ఒప్పందం సమయంలో చిదంబరం తనయుడికి భారీ స్థాయిలో ముడుపులు అందాయి. 2006 నుంచి 2014 మధ్యన చిదంబరం కుటుంబం విదేశాల్లో కూడబెట్టిన ఆస్తుల విలువే ఇరవై వేల కోట్ల రూపాయలు.

ఇప్పటికే కార్తీ మీద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసింది, ఈ విధంగా ఉచ్చు బిగుస్తున్న సమయంలో కార్తీ లండన్ వెళ్లడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అరెస్టు భయంతోనే కార్తీ విదేశానికి పారిపోయాడనే ఆరోపణ వినిపిస్తోంది. అయితే అలాంటిదేమీ లేదని తన తనయుడు తిరిగి వస్తాడు చూడండని చిదంబరం అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.