యాప్నగరం

ఓటు హక్కు వినియోగించుకున్న సెలెబ్రిటీలు

రాజకీయ, సినిమా రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులు తమిళనాడు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

TNN 16 May 2016, 9:23 am
రాజకీయ, సినిమా రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులు తమిళనాడు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందరికీ మార్గదర్శిలా సూపర్ స్టార్ రజినీకాంత్ పోలింగ్ ప్రారంభమైన పదినిమిషాలకే వచ్చి స్టెల్లా మేరీస్ కాలేజ్ లో బాధ్యతాయుతంగా ఓటు వేసి వెళ్లారు. అనంతరం డీఎంకే చీఫ్ కరుణానిధి గోపాలపురంలోని శ్రీ శారద సెకండరీ స్కూల్‌లో ఓటేశారు. అలా ప్రముఖ వ్యక్తుల తాకిడి మొదలైంది. కరుణానిధి కొడుకు స్టాలిన్ కుటుంబంతో ఓటేసేందుకు వచ్చారు. లోక నాయకుడు కమల్ హాసన్, గౌతమి, కూతురు అక్షరతో కలిసి వచ్చి ఓటేశారు. మరో తమిళ స్టార్ అజిత్, అతని భార్య షాలిని తిరువన్మయూర్ లోని కుప్పం ప్రభుత్వపాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి రాజేష్ లఖోని కూడా పౌరునిగా తన బాధ్యతను నిర్వర్తించారు. సీనియర్ నటి ఖుష్బూ కూడా ఓటును వేశారు.
Samayam Telugu karunandhi rajinikanth among early voters as polling begins
ఓటు హక్కు వినియోగించుకున్న సెలెబ్రిటీలు


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.