యాప్నగరం

జయ ఆరోగ్యంపై కరుణానిధి భార్య ఆరా

చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను డీఎంకే అధినేత కరుణానిధి భార్య రజతి అమ్మాళ్ పరామర్శించారు.

TNN 14 Oct 2016, 5:06 pm
చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను డీఎంకే అధినేత కరుణానిధి భార్య రజతి అమ్మాళ్ పరామర్శించారు. గురువారం రాత్రి ఆసుపత్రికి వెళ్లిన అమ్మాళ్.. జయలలితను పరామర్శించిన తరవాత జయ ఆరోగ్య పరిస్థితిని ఆమె స్నేహితురాలు శశికళ నటరాజన్‌ను అడిగి తెలుసుకున్నారని డీఎంకే వర్గాలు వెల్లడించాయి.
Samayam Telugu karunanidhis wife rajathi ammal meets sasikalaa enquires about jayalalithaas health
జయ ఆరోగ్యంపై కరుణానిధి భార్య ఆరా

రజతి అమ్మాళ్‌ వెంట ఆమె కూతురు, రాజ్యసభ ఎంపీ కనిమొళి కూడా ఉన్నారు. జయలలిత వీలైనంత త్వరగా కోలుకోవాలని వీరిద్దరూ ఆకాంక్షించారు. రజతి కంటే ముందు శనివారం నాడు డీఎంకే నేతలు ఎంకే స్టాలిన్, దురైమురుగన్, పొన్ముది జయలలితను పరామర్శించారు. అలాగే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం. తంబీదురై, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పన్నీర్ సెల్వం, ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ జయను పరామర్శించిన వారిలో ఉన్నారు. వీరంతా జయలలిత త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.