యాప్నగరం

జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్... ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకాశ్మీర్‌లో పుల్వామా ప్రాంతంలో కొందరు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందింది. దీంతో అక్కడకు చేరుకున్న భద్రత బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. అక్కడే నక్కి ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు భద్రత బలగాలపై ఒక్కసారిగా కాల్పులకు దిగారు.

Samayam Telugu 25 Apr 2020, 9:33 am
జమ్మూకశ్మీర్‌లో భద్రత బలగాలు ఎన్ కౌంటర్ నిర్వహించారు. పుల్వామా జిల్లాలో జరిగిన ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరితో పాటు... వారికి సహకరిస్తున్న మరో వ్యక్తిని కూడా మట్టుపెట్టారు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని అవంతిపొరలోని గోరిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయి. తెల్లవారుజామున ఆయా ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించాయి.
Samayam Telugu encounter


ఇదే సమయంలో భద్రతా బలగాలకు ఎదురుపడిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు ప్రారంభించారు. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు, వారికి సహకరిస్తున్న మరో వ్యక్తి హతమయ్యారని పేర్కొన్నారు. ఇంకా అక్కడ గాలింపు కొనసాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.