యాప్నగరం

ఐదుగురు ఉగ్రవాదులు హతం.. అమరుడైన జవాన్

చొరబాటుకు ప్రయత్నించిన ముష్కర మూకలను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్‌లో ఓ జవాన్ వీర మరణం పొందారు.

Samayam Telugu 24 Sep 2018, 3:57 pm
మ్ము కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత భద్రతాదళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ ఆపరేషన్‌లో ఓ జవాన్ అమరుడయ్యాడు. ఆదివారం (సెప్టెంబర్ 23) నుంచి కొనసాగిన ఎదురుకాల్పుల్లో మొత్తం ఐదుగురు ముష్కరులను కడతేర్చారు. కుప్వారా జిల్లా తంగ్‌దర్ సెక్టార్‌లో ముష్కరుల చొరబాటుకు యత్నిస్తున్న సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఎదురుదాడి ప్రారంభించాయి. ఎల్‌వోసీ వెంట భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు సంభవించాయి.
Samayam Telugu kupwara


చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదుల్లో ముగ్గురిని ఆదివారమే హతమార్చారు. సోమవారం మరో ముగ్గురిని మట్టుబెట్టారు. ఈ ఆపరేషన్‌లో ఓ జవాన్ వీర మరణం పొందినట్లు ఆర్మీ స్పోక్స్‌పర్సన్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.